31.7 C
Hyderabad
April 25, 2024 00: 22 AM
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

స్వామివారి వెండి కిరీటం మాయం వాస్తవమే

Anil-Kumar-Singhal

తిరుమల తిరుపతి దేవస్థానం ఖజానా నుంచి ఒక వెండి కిరీటం, రెండు బంగారు ఉంగరాలు, రెండు బంగారు నెక్లెస్ లు, ఒక బంగారు నాణెం మాయం అయిన మాట వాస్తవమేనని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివరణ ఇచ్చారు. ఈ వస్తువులు మాయం కావడానికి అప్పటి ట్రెజరీ ఏఈవో శ్రీనివాసులను బాధ్యులుగా గుర్తించి ఆయన జీతం నుంచి ఏడు లక్షల 36 వేల రూపాయల రికవరీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఇవో తెలిపారు. ఏ అధికారి హయాంలో ఆభరణాలు మాయం అవుతాయో వారి నుంచే రికవరీ చేయడం టిటిడి నిబంధన అని ఆయన తెలిపారు. మరోసారి ఆభరణాలను సరిచూసుకుని తదనుగుణంగా చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు. అదే విధంగా వచ్చే సెప్టెంబర్ నెల అన్ని ఆభరణాలను మళ్లీ తనిఖీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. 15 రోజుల్లో తనిఖీ పూర్తి అవుతుందని ఇవో తెలిపారు. ప్రస్తుతం అయితే రికార్డుల్లో ఉన్న వెండి కన్నా  అదనంగా వెండి వస్తువులను గుర్తించామని ఆయన వెల్లడించారు.

Related posts

17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఫిరాయింపుకు సిద్ధం

Satyam NEWS

ఇమ్మానియేల్ చర్చ్ లో ఘనంగా యేసు పునరుత్థాన పండుగ

Satyam NEWS

ఉనికి కోసమే టీడీపీ బస్సు యాత్ర…!

Satyam NEWS

Leave a Comment