24.7 C
Hyderabad
February 10, 2025 22: 45 PM
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

స్వామివారి వెండి కిరీటం మాయం వాస్తవమే

Anil-Kumar-Singhal

తిరుమల తిరుపతి దేవస్థానం ఖజానా నుంచి ఒక వెండి కిరీటం, రెండు బంగారు ఉంగరాలు, రెండు బంగారు నెక్లెస్ లు, ఒక బంగారు నాణెం మాయం అయిన మాట వాస్తవమేనని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివరణ ఇచ్చారు. ఈ వస్తువులు మాయం కావడానికి అప్పటి ట్రెజరీ ఏఈవో శ్రీనివాసులను బాధ్యులుగా గుర్తించి ఆయన జీతం నుంచి ఏడు లక్షల 36 వేల రూపాయల రికవరీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఇవో తెలిపారు. ఏ అధికారి హయాంలో ఆభరణాలు మాయం అవుతాయో వారి నుంచే రికవరీ చేయడం టిటిడి నిబంధన అని ఆయన తెలిపారు. మరోసారి ఆభరణాలను సరిచూసుకుని తదనుగుణంగా చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు. అదే విధంగా వచ్చే సెప్టెంబర్ నెల అన్ని ఆభరణాలను మళ్లీ తనిఖీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. 15 రోజుల్లో తనిఖీ పూర్తి అవుతుందని ఇవో తెలిపారు. ప్రస్తుతం అయితే రికార్డుల్లో ఉన్న వెండి కన్నా  అదనంగా వెండి వస్తువులను గుర్తించామని ఆయన వెల్లడించారు.

Related posts

మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి ఆకస్మిక మరణం

Satyam NEWS

ఏప్రిల్ 21న 8వ విడ‌త‌ అఖండ బాలకాండ పారాయ‌ణం

Satyam NEWS

ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కు ARSI గా పదోన్నతి

Satyam NEWS

Leave a Comment