కరోనా కారణంగా రెండేళ్లుగా నిలిపివేసిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలను ఏప్రిల్ 1 నుంచి తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు భక్తులను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు నిర్ణయించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఆర్జిత సేవల టికెట్లను ఆన్లైన్లో మార్చి 20న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది.
ఈ మేరకు టికెట్లను బుక్ చేసుకునేందుకు ఈ నెల 22 వరకు గడువు విధించింది. tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టికెట్లు కేటాయింపు ఉంటుందని.. ఈ నెల 22న టికెట్లు పొందిన వారికి వివరాలు పంపనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు తెలిపింది.