తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ పాలక మండలి శనివారం నాడు కూలంకషంగా చర్చించింది. రెండేళ్ల తర్వాత ఆలయం వెలుపల జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అదే సమయంలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేసింది.
టీటీడీ పాలక మండలి నిర్ణయాలు
శాశ్వత వసతి కోసం గోవర్ధన్ అతిధి గృహం వెనుక రూ. 95 కోట్లతో నూతన వసతి భవనం నిర్మాణానికి అమోదం.
తిరుపతి లో వకుళామాత ఆలయం అభివృద్ధికి పాలకమండలి నిర్ణయం
తిరుమలలో వసతి గృహాలలో గీజర్ల ఏర్పాటు కు రూ. 7.90 కోట్లు ఆమోదం
నెల్లూరు లో శ్రీవారి ఆలయం, కళ్యాణమండపం నిర్మాణానికి అమోదం.
తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల రూ. 6.37 కోట్లతో అభివృద్ధి.
టిటిడి ఉద్యోగులు ఇళ్ల స్థలాలు మంజూరు.
300 ఎకరాలతో పాటు మరో 130 ఎకరాలు కొనుగోలుకు అమోదం.
బ్రహ్మోత్సవాల అనంతరం ఎస్ఎస్డి టికెట్లు ప్రారంభం.
సామాన్య భక్తులకు పెద్ద పీట.. వీఐపీ దర్శనం ఉదయం 10 నుండి 12 గంటల మధ్య మార్పుకు పాలకమండలి నిర్ణయం.