40.2 C
Hyderabad
April 24, 2024 15: 25 PM
Slider వరంగల్

తుడుందెబ్బ వ్యవస్థాపకుడి కుటుంబానికి ఆర్ధిక సాయం

#Tudumdebba

తుడుందెబ్బ వ్యవస్థాపకుడు దబ్బగట్ల నర్సింగరావు అకాల మరణం పట్ల ఆధివాసీ ఉద్యోగుల పరపతి సంఘం, నర్సంపేట, కొత్తగూడ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, సంఘ సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆదివాసి సమాజాన్ని సమాయత్తం చేసి పోరు చేసిన గొప్ప వ్యక్తి ఆయన అని గుర్తుచేసుకున్నారు. దబ్బగట్ల నర్సింగరావు జాతికి చేసిన సేవలు మరువలేనివని వారన్నారు.

ఆయన కుటుంబానికి 50 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట, కొత్తగూడ ఆదివాసీ ఉద్యోగ పరపతి సంఘాల అధ్యక్షుడు ధనుసరి అంజయ్య, ప్రదానకార్యదర్శి ఇర్ప చంద్రయ్య, సువర్ణపాక జగ్గారావు పాల్గొన్నారు.

ఇంకా, వాసం కుమారస్వామి, గట్టి పాపయ్య, దనుసరి పాపయ్య, సుంచ శ్రీను, గొంది సమ్మయ్య, గంటమోరి తిరుపతి, కల్తి సారంగపాణి, ఈక లక్ష్మీ నర్సు, వాసం వీరస్వామి, సనుప రాంచంధర్, ఈసం నర్సింహరావు తో పాటు రాయినిగూడెం గ్రామ సర్పంచ్ స్వామి, తవిటి సత్యం, వజ్జ రాజు ,కొమురవెల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పంగడ పూట జనగామ జిల్లాలో ఒక వ్యక్తి దారుణ హత్య

Satyam NEWS

రైల్వే ప్రైవేట్ పరం చేయాలన్న యోచనను విరమించుకోవాలి

Satyam NEWS

నేరాల దర్యాప్తులో సాంకేతికతను వాడండి

Satyam NEWS

Leave a Comment