చరిత్రలో మొఘలు, తర్వాత మహమ్మద్ బీన్ తుగ్లక్ తరచూ రాజధానులు మార్చేవారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తిందని మాజీ కేంద్రమంత్రి అశోకగజపతి రాజు విమర్శించారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై ఆయన నేడు ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, నాడు అమరావతిలో రాజధాని పెడదామంటే ఊ కొట్టిన నేటి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు రోజుకో చోట రాజధాని పెడతానంటూ చెబుతున్నారని ఆయన అన్నారు.
33 వేల ఎకరాల భూములు త్యాగం చేసిన రైతుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ చేశారని ఆయన తెలిపారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని నెలకో రాజధాని పెట్టమనండి, అప్పుడు కూడా ఫిబ్రవరి నెలలో 28 రోజులే ఉన్నాయని గొడవ మొదలవుతుంది అని ఎద్దేవా చేశారు.