నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని మాట తప్పిన బిజెపి ఇప్పుడు తమిళనాడులో పసుపు బోర్డు పెడతామని చెబుతున్నది. పుండుమీద కారం చల్లినట్లు ఉన్న ఈ ప్రకటనతో అర్మూర్ లోని పసుపు రైతులు భగ్గుమన్నారు.
తమిళనాడు బీజేపీ మ్యానిఫెస్టో ప్రతులను అర్మూర్ పసుపు రైతుల దహనం చేశారు. తమిళనాడులో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, పసుపుకు 15 వేల మద్దతు ధర ప్రకటిస్తామని తమిళనాడు బిజెపి తన మేనిపెస్టోలో చేర్చడం పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయలేమని ఎంపీ సురేష్ రెడ్డి ప్రశ్నకు కొద్ది రోజుల కిందట కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. ఇప్పుడు తమిళనాడులో ఎలా ఏర్పాటు చేస్తారని పసుపు రైతులు ప్రశ్నిస్తున్నారు.
రాబోయే రోజుల్లో బీజేపీకి, ఎంపీ ధర్మపురి అరవింద్ కు తగిన గుణపాఠం చెబుతామని పసుపు రైతులు చెప్పారు.