30.7 C
Hyderabad
April 24, 2024 02: 57 AM
Slider నిజామాబాద్

ఇక్కడ లేదు కానీ తమిళనాడులో పసుపు బోర్డు పెడతారా?

#turmericfarmers

నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని మాట తప్పిన బిజెపి ఇప్పుడు తమిళనాడులో పసుపు బోర్డు పెడతామని చెబుతున్నది. పుండుమీద కారం చల్లినట్లు ఉన్న ఈ ప్రకటనతో అర్మూర్ లోని పసుపు రైతులు భగ్గుమన్నారు.

తమిళనాడు బీజేపీ మ్యానిఫెస్టో ప్రతులను అర్మూర్ పసుపు రైతుల దహనం చేశారు. తమిళనాడులో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, పసుపుకు 15 వేల మద్దతు ధర ప్రకటిస్తామని తమిళనాడు బిజెపి తన మేనిపెస్టోలో చేర్చడం పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయలేమని ఎంపీ సురేష్ రెడ్డి ప్రశ్నకు కొద్ది రోజుల కిందట కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. ఇప్పుడు తమిళనాడులో ఎలా ఏర్పాటు చేస్తారని పసుపు రైతులు ప్రశ్నిస్తున్నారు.

రాబోయే రోజుల్లో బీజేపీకి, ఎంపీ ధర్మపురి అరవింద్ కు తగిన గుణపాఠం చెబుతామని పసుపు రైతులు చెప్పారు.

Related posts

జాతీయ స‌గ‌టును మించి తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్

Satyam NEWS

ఎల్ జి పాలిమర్స్ డైరెక్టర్ల పాస్ పోర్టులు సీజ్

Satyam NEWS

ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావాలి

Satyam NEWS

Leave a Comment