27.7 C
Hyderabad
April 26, 2024 04: 42 AM
Slider ముఖ్యంశాలు

13న టీయూడబ్ల్యూజే జర్నలిస్టుల ఉపవాస దీక్ష

#TUWJ

కరోనా కాటుకు గురవుతున్న జర్నలిస్టులను ఆదుకోవడంలో ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జూన్ 13న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఒక రోజు జర్నలిస్టుల ఉపవాస దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) స్పష్టం చేసింది.

బుధవారం నాడు బషీర్ బాగ్ లోని దేశోద్ధార కభవన్ లో జరిగిన యూనియన్ ముఖ్య బాధ్యుల సమావేశంలో రాష్ట్రంలో జర్నలిస్టుల స్థితిగ తుల పై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీలు మాట్లాడుతూ కరోనా ప్రమాదం అంచున కొట్టుమిట్టాడుతున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం అపహాస్యం చేయడం సరైనది కాదన్నారు.

జర్నలిస్టు చనిపోయినా ప్రభుత్వం స్పందించలేదు

గాంధీ ఆస్పత్రి నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే కరోనా కాటుకు యువ పాత్రికేయుడు మనోజ్ బలైపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఆయన కుటుంబాన్ని ఆదుకొనే విషయంలో కూడా ముందుకు రాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శమన్నారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో 20 మంది పాత్రికేయులు కరోనా కాటుకు గురై చికిత్సా పరంగా పలు ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టీయూడబ్ల్యూజే ఆందోళనకు పూనుకుంటున్నట్లు వారు స్పష్టం చేశారు.

మీడియా కోసం ప్రత్యేక ఆసుపత్రి కావాలి

కరోనాతో మృతిచెందిన జర్నలిస్టు మనోజ్ కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారాన్ని చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అంతే కాకుండా కరోనా కాటుకు గురైన మీడియా సిబ్బందికి చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రిని కేటాయించాలన్నారు.

అత్యవసర సేవల విభాగం కింద పనిచేస్తున్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రూ. 50లక్షల ఆరోగ్య బీమాను జర్నలిస్టులకు కూడా వర్తింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వారు కోరారు. కరోనా వ్యాధికి గురైన మీడియా సిబ్బందికి ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహకారాన్ని అందించాలని వారు సూచించారు.

 దీక్షకు అందరూ కలిసి రావాలి

డిమాండ్లపై ప్రభుత్వం స్పందించని పక్షంలో జర్నలిస్టులను ఆదుకోవడానికి తాము భిక్షాటనకు సిద్ధం కావాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. కరోనాపై ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలను పాటిస్తూనే జూన్ 13న ఉపవాస దీక్ష చేస్తున్నామని, జర్నలిస్టుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉన్న జర్నలిస్టుల సంఘాలు ఈ దీక్షకు కలిసి రావాలని శ్రీనివాస్ రెడ్డి, విరాహత్ అలీలు కోరారు.

జర్నలిస్టుల కష్టాలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని, రాష్ట్ర గవర్నర్ ను ప్రతినిధి బృందం కలువతల పెట్టిందన్నారు. ఈ సమావేశంలో ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే ఉపప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు అజిత, రాములు, హబీబ్ జిలానీ, స్వామి, హెచ్.యూ.జే అధ్యక్షులు రియాజ్ అహ్మద్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కె.శ్రీకాంత్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యం.వెంకట్ రెడ్డి, జి.బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈ నెల 10న పాక్షిక చంద్ర గ్రహణం.. ఈ ఏడాది మరో రెండు

Satyam NEWS

నేస్తం పౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్స్ పంపిణీ

Satyam NEWS

సుకన్య సమృద్ధి యోజన పాస్ బుక్కుల పంపిణీ

Bhavani

Leave a Comment