కర్నూలులో జంట హత్యల ఘటన కలకలం రేపుతోంది. కర్నూలులోని చింతలముణి నగర్ తల్లీ కుమార్తెను కత్తులతో నరికి హత్య చేశారు. ఇంటి యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ కలహాలతోనే ఈ హత్య లు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన వారిని రుక్మిణి దేవి,రమదేవి గా గుర్తించారు. వెంకటేశ్వర్లు గాయాలతో ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు రుక్మిణీ దేవి వివాహం మే కారణమని చెబుతున్నారు. రుక్మిణి దేవికి చెందిన భర్త శ్రావణ్ కుమార్ ఈ హత్య చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శ్రావణ్ కుమార్, రుక్మిణి దేవికి 14 రోజుల క్రితం వివాహమైంది. హత్యకు కారణం నవ వధువు, వరుడు మధ్య వివాదంతో కుటుంబ సభ్యులు గోడ పడడంతో కూరగాయల కత్తితో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
previous post