ఎలోన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసినప్పటి నుండి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతా నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ ఉంది. అయితే చాలా మంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. వీటన్నింటి మధ్య, ఎలోన్ మస్క్ శనివారం ట్విట్టర్ పోల్ చేశారు. ఇందులో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలా? వద్దా అని మస్క్ అడిగారు. ఈ ట్విట్టర్ పోల్లో ప్రతి గంటకు ఒక మిలియన్ మంది ప్రజలు ఓటు వేస్తున్నారు. ఇప్పుడు ఈ పోల్లో 80 లక్షల మందికి పైగా ఓటు వేశారు.
ఈ వార్త రాసే సమయానికి 52.8 శాతం మంది ట్రంప్ ట్విటర్లోకి తిరిగి రావడాన్ని సమర్థించగా, 47.2 శాతం మంది వ్యతిరేకంగా ఉన్నారు. అమెరికా ఎన్నికల తర్వాత జో బిడెన్ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. ఈ సమయంలో, డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు వైట్ హౌస్ వెలుపల, లోపల గందరగోళం సృష్టించారు. ఈ హింసాత్మక ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని, ట్విట్టర్ ట్రంప్ ఖాతాను 12 గంటలపాటు సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆ నిషేధాన్ని కొనసాగిస్తూ ట్రంప్ ఖాతాను ట్విట్టర్ పూర్తిగా సస్పెండ్ చేసింది.
8 జనవరి 2021న డోనాల్డ్ ట్రంప్ను పూర్తిగా ట్వట్టర్ నిషేధించింది. ఎలోన్ మస్క్ 27 అక్టోబర్ 2022న ట్విట్టర్ని కొనుగోలు చేశారు. అప్పటి నుండి, ట్రంప్ ట్విట్టర్లోకి ఎప్పుడు తిరిగి వస్తారని మీడియా, ట్విట్టర్ వినియోగదారులు మస్క్ను పదేపదే అడుగుతున్నారు. ఎలోన్ మస్క్ ఈ అంశంపై మాట్లాడుతూ ఈ ప్రశ్న అడిగిన వారి నుంచి ప్రశ్న అడిగినప్పుడల్లా ఒక డాలర్ వసూలు చేస్తే, ఈ రోజు ట్విట్టర్లో చాలా డబ్బు ఉంటుంది. ఈ ప్రశ్న తనను లెక్కలేనన్ని సార్లు అడిగారని, ప్రశ్నకు డబ్బులు వసూలు చేసి ఉంటే ట్విట్టర్ గొప్పగా ఉండేదని మస్క్ వ్యంగ్యంగా అన్నాడు.