28.2 C
Hyderabad
April 20, 2024 12: 17 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ లో ఈనెల 27న టియుడబ్ల్యూజే జిల్లా మహాసభ

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఈనెల 27న, టియుడబ్ల్యూజే,ఐజేయు యూనియన్ సూర్యాపేట జిల్లా మహాసభ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కోల నాగేశ్వరరావు,దయాకర్ రెడ్డి,టివిల్, తెలిపారు. గురువారం హుజూర్ నగర్ పట్టణంలో యూనియన్ మహాసభ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా యూనియన్ మహాసభకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్,గాదరి కిషోర్ కుమార్,జడ్పీ చైర్మన్ దీపిక యుగంధర్ తో పాటుగా యూనియన్ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి,ఢిల్లీ ఏపీ మీడియా సలహాదారులు దేవలపల్లి అమర్,రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్,ప్రధాన కార్యదర్శి విరాహాత్ ఆలీ,జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి,జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కొంజేటి సత్యనారాయణ,జిల్లా నాయకత్వం అందరూ హాజరవుతున్నట్లు తెలిపారు.

జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఎన్.నరేందర్, బసవోజు శ్రీనివాస చారి,పిల్లలమర్రి శ్రీనివాస్,కీతా రామనాథం,జానీ పాషా,భాస్కర్,రాంరెడ్డి, ఆర్ పి గౌడ్,రాజు,వెంకటరెడ్డి,అంజయ్య రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

సచివాలయాలను ఆకశ్మీకంగా తనిఖీ చేసిన విజయనగరం కలెక్టర్

Satyam NEWS

బోధ చేయని గురువు!

Satyam NEWS

ప్రజావాణి దరఖాస్తులను సీరియస్ గా పరిష్కరించండి

Satyam NEWS

Leave a Comment