39.2 C
Hyderabad
March 29, 2024 15: 08 PM
Slider ప్రత్యేకం

అనకాపల్లిలో ఘోర ప్రమాదం: ఫ్లై ఓవర్ బీమ్ కూలి ఇద్దరు మృతి

#Anakapally

హైవే విస్తరణలో భాగంగా అనకాపల్లి బైపాస్  వద్ద జరుగుతున్న నిర్మాణంలో అపశృతి చోటు చేసుకున్నది.

స్థానిక బైపాస్ రోడ్డు కొత్తగా నిర్మాణం జరుగుతున్న కలకత్తా హైవే బైపాస్ రోడ్డు నిర్మాణంలో ఉన్న పనులు జరుగుతూ ఉండగా అక్కడ నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆకస్మాత్తుగా కూలిపోయింది.

దాని కింద నుంచి వెళ్తున్న వాహనాలు ఒక కారు ఒక లారీ  బ్రిడ్జి కింద ఉండిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్టుగా అనుమానిస్తున్నారు.

ఈ  ఓవర్ బ్రిడ్జి దిమ్మలు పైకి తీస్తే గాని ఎంతమంది చనిపోయింది అనేది తెలియదు. ఏ బ్రిడ్జి నిర్మాణంలో నాసిరకం మెటీరియల్ వాడడం వల్ల కూలి పోయిందా లేక సాంకేతిక టెక్నికల్ ప్రాబ్లం వల్ల కూలిపోయిందా అన్నది తెలియాల్సి ఉంది.

ఈ సంఘటన పట్టణంలో ఒక చర్చనీయాంశంగా తయారైంది ఆ దారి వెంట వెళ్లే వాహనాలు కొంత ట్రాఫిక్ అయిపోయింది

ప్రయాణికులు ఇక్కట్లకు గురయ్యారు పక్కనుంచి మరో మట్టిరోడ్డు ఉండడంతో ఆ పక్క నుంచి ట్రాఫిక్ మళ్ళించడం జరిగింది.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

మృతి చెందిన వారిని బయటకు తీసేందుకు బ్రిడ్జి నిర్మాణం ఇంజనీర్లు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Related posts

షర్మిల అరెస్టు పై భిన్నాభిప్రాయాలు

Satyam NEWS

402 గ్రామపంచాయతీలలో క్రీడా ప్రాంగణాలు

Murali Krishna

10 శాతం రిజ‌ర్వేష‌న్లపై హ‌ర్షాతిరేకాల వెల్లువ

Sub Editor

Leave a Comment