వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండరావిపాకుల సర్పంచ్ లచమ్మ (51), తన మనవడు యోగేశ్వర్ (7) తెల్లవారు జామున మట్టి మిద్దె కూలి మృతి చెందారు.
రాత్రి ఆ గ్రామ సర్పంచ్ లచ్చమ్మ మనవడు యోగేశ్వర్ తో ఇంట్లో పడుకుని ఉంది, పాత మిద్దె కావడంతో రాత్రి కూలిపోయి ఇద్దరు మృతి చెందారు. బండ రాయిపాకుల ఏదుల రిజర్వాయర్ ముంపు గ్రామం కావడంతో చాలా రోజులుగా పునరావాసం కోసం వేచిచూస్తున్న గ్రామస్తులు, ప్రభుత్వం పునరావాసం కల్పించకపోవడంతో అదే ఇళ్లలో ఉంటున్నారు. రాత్రి ఇలా జరగడంతో గ్రామం మొత్తం విషాదఛాయలు అలముకున్నాయి.