కువైట్ లోని ఒఫ్రా ప్రాంతంలో ఆదివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సెబారా కాలిపోయింది.
దాంతో కడప జిల్లా రాజంపేట మండలం బ్రాహ్మణ పల్లెకు చెందిన మౌలా సాహెబ్ మరణించారు.
అదే విధంగా పక్క సెబారా లో ఉన్న ఓబులవారిపల్లె కు చెందిన నారాయణ కూడా కాలిపోయి దుర్మరణం చెందారు.
ఈ సంఘటన అక్కడి కార్మికులలో విషాదం నింపింది.