తూర్పుగోదావరి జిల్లా తునిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక పార్క్ సెంటర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ట్రాన్స్ పోర్ట్ లారీ ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
విశాఖ జిల్లా కోటవురట్ల గ్రామానికి చెందిన బర్రె వేణు, లోవలక్ష్మి దంపతులకు ముగ్గురు పిల్లల సంతానం. వేణు తుని మండలం కవలపాడు గ్రామంలో భార్యతో కలిసి ఇటుక బట్టి లో కూలి పని చేస్తుంటారు.
ఆదివారం పాఠశాలకు సెలవు దినం కావడంతో కోటవురట్ల లో ఉంటున్న ఇద్దరు పిల్లలను వేణు తాను పనిచేస్తున్న ప్రాంతానికి మోటారు బైక్ పై తీసుకు వస్తుండగా ప్రమాదం జరిగింది.
తుని పార్క్ సెంటర్ వద్ద ట్రాన్ పోర్టు లారీ బైక్ ని ఢీకొనడంతో బర్రె దుర్గ(17) బర్రె తాటాజీ (7) లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
ఇద్దరు పిల్లలు తన కళ్ళెదుటే చనిపోవటంతో తండ్రి వేణు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.