కర్నూలు జిల్లా పత్తికొండలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దురదృష్టకర సంఘటనలో ఇద్దరు మరణించారు.
పత్తికొండ హోసూర్ రోడ్డు లో వేరు సెనగ నూర్పిడి ట్రాక్టర్, స్కూటర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
ఈ ఘటనలో ఒకరి తల, ఒక చెయ్యి తెగి రోడ్డు పై పడగా, మరొకరు రోడ్డు ప్రక్కన పడి అక్కడికక్కడే మృతి చెందారు.
మృతి చెందిన వ్యక్తులు పత్తికొండ కు చెందిన జిలాన్, చాంద్ భాషాలుగా పోలీసులు గుర్తించారు.
వీరిద్దరూ మద్దికెర మండలం బురుజుల గ్రామం లో బేల్దార్ పని ముగించుకొని స్వగ్రామం పత్తికొండ కు చేరుకునే సమయంలో హోసూరు రహదారిలో ఈ దారుణమైన ఘటన జరిగింది.