బ్లాక్ ఫంగస్తో బాధపడుతున్న ఇద్దరు రోగులు మరణించినట్లు తిరుపతి రుయా ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.
చిత్తూరు జిల్లాలోని నిమ్మనపల్లెకి చెందిన రాజేంద్రబాబు,కుప్పం ప్రాంతానికి చెందిన రామచంద్రయ్య బ్లాక్ ఫంగస్చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
మరో ఐదుగురు బాధితులు ఇదే లక్షణాలతో చికిత్స తీసుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వారికి మెరుగైన వైద్య సహాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.