37.2 C
Hyderabad
April 19, 2024 10: 58 AM
Slider ప్రత్యేకం

శాడ్ స్టోరీ: ఒకే గదిలో ఇద్దరు ఆడపిల్లలు ఆత్మహత్య

two girls

తల్లిదండ్రులకు పిల్లలు భారమా? మేమైతే భారంగా ఉన్నాం అందుకే ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నాం అంటూ ఇద్దరు యువతులు ఒకే రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అత్యంత హృదయ విదారకమైన ఈ సంఘటన హైదరాబాద్ శివారు ప్రాంతమైన హయత్ నగర్ లో నేడు జరిగింది.

హయత్ నగర్ లోని రాఘవేంద్ర కాలనీలో ఒకే రూంలో ప్యాన్ కు ఉరేసుకొని ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ ప్రాంతం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. వారిద్దరూ  మమత, గౌతమి అనే ఇద్దరు స్నేహితులు. మమత స్వస్థలం మహబూబ్  జిల్లా పోతునపల్లి. గత కొన్నేళ్ళ క్రితం నగరానికి వచ్చి తల్లిదండ్రులతో కలిసి  హయత్ నగర్ శ్రీనివాసపురం కాలనీలో నివాసం ఉంటున్నది.

మమత ఇంటర్ పూర్తి చేసింది. గౌతమి స్వస్థలం కర్నూల్ జిల్లా మాధవరం మండలం వెలుగోడు. ఇద్దరు పక్క పక్కనే నివాసం ఉండేవారు. మమత తల్లిదండ్రులు మహబూబ్  నగర్  లో  గత బుధవారం నాడు వివాహానికి  వెళ్లగా  ఈ రోజు ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులకి భారంగా ఉన్నామని సూసైడ్ చేసుకుంటున్నామని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య కి పాల్పడ్డారు. గౌతమి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

పేదలకు ఏడాదిపాటు ఉచిత రేషన్

Bhavani

హాస్టల్ విద్యార్ధుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన మంత్రి

Satyam NEWS

పీఆర్ ప్రాజెక్ట్ పనులకు కావలసిన భూసేకరణను వేగవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment