36.2 C
Hyderabad
April 25, 2024 22: 32 PM
Slider జాతీయం

గ్రెనేడ్ దాడి లో ఇద్దరు మృతి

#terroristsattack

జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు కార్మికులను ఉగ్రవాదులు హతమార్చారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారిని పట్టుకోవడానికి పోలీసులు సెర్చ్ అండ్ కార్డన్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో నిషేధిత సంస్థ లష్కరే తోయిబాకు చెందిన  ఉగ్రవాది ని అరెస్టు చేశారు. షోపియాన్లోని హర్మెన్ ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రెనేడ్ ను విసరడంతో ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ కు చెందిన ఇద్దరు కూలీలు  గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించామని, అయితే అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో వారు చనిపోయారని పేర్కొన్నారు. మృతులను మోనిష్ కుమార్, రామ్ సాగర్ లుగా పోలీసులు గుర్తించారు. దాడి అనంతరం ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు

. ఈ ఆపరేషన్ సందర్భంగా గ్రెనేడ్ విసిరిన లష్కరే తోయిబాకు చెందిన  ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ ధృవీకరించారు. ”నిషేధిత ఉగ్రవాద సంస్థ హర్మెన్ షోపియాన్ కు చెందిన లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ఇమ్రాన్ బషీర్ గనీ అనే ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు కార్మికులపై గ్రెనేడ్ ను విసిరాడు. దీనిపై తదుపరి దర్యాప్తు జరుగుతున్నట్లు  అని ఆయన పేర్కొన్నారు

Related posts

గోరంట్ల మాధవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి

Satyam NEWS

మేడారంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0

Satyam NEWS

“బ్యాక్ డోర్” బ్లాక్ బస్టర్ అవ్వాలి: లవ్లీ హీరో ఆది సాయికుమార్

Satyam NEWS

Leave a Comment