27.7 C
Hyderabad
March 29, 2024 03: 09 AM
Slider విశాఖపట్నం

విశాఖ రోడ్డు ప్రమాదంలో తల్లీకుమార్తె మృతి

#arilova

విశాఖపట్నంలోని ఆరిలోవ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మరణించారు. ఆరిలోవ హెల్త్ సిటీ క్యూ ఒన్  ఆసుపత్రి సమీపంలో బి.ఆర్.టి.ఎస్ రోడ్ లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తల్లీ కూతుర్లు ఎదురుగా వస్తున్న చిన్న కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సంఘటనా ప్రదేశంలో కుమార్తె కె. మౌనిక(22)  మృతి చెందింది. తల్లి సత్యవేణి(45) కి బలమైన గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. సత్యవేణి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. మృతులు సుజాత నగర్ పాపయ్యరాజు పాలెం నివాసులుగా పోలీసులు గుర్తించారు. మృతురాలు మౌనిక ఇటీవల ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆరిలోవ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

వెనక్కి తగ్గిన పళని.. అన్నాడీఎంకే సారథిగా పన్నీర్ సెల్వం

Sub Editor

స్వ‌ర్ణ‌క‌వ‌చాలంకృత క‌న‌క‌దుర్గాదేవి

Satyam NEWS

టోల్ ఫ్రీ తో కొత్త సమస్య

Sub Editor 2

Leave a Comment