సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు వద్ద జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఫార్మా కంపెనీకి చెందిన బస్సు డ్రైవర్ మితిమీరిన వేగానికి, నిర్లక్ష్యానికి ఇద్దరు కార్మికుల నిండు ప్రాణాలు బలి అయ్యాయి.
ఇండియన్ అయిల్ పెట్రోల్ బంకు వద్ద హెచ్ ఎం డబ్యూ ఎస్ వాటర్ లైన్ పనులలో భాగంగా కొందరు కూలీలు విధులు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో పాశం మైలారం నుంచి వస్తున్న గ్లాండ్ ఫార్మా కంపెనికి చెందిన ( డీఎస్ 20యూజీ 990) నంబరు గల బస్సు వేగంగా కూలీలపైకి దూసుకుపోయింది.
దాంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న బీహార్ కు చెందిన రాజ్ కుమార్ (32) ,ఒరిస్సా కు చెందిన అర్జున్ ( 35)అనే ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
సంఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న పటాన్ చెరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాలని పోస్టుమార్టానికి తరలించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.