27.7 C
Hyderabad
April 26, 2024 05: 03 AM
Slider వరంగల్

ముసలమ్మ గుట్ట ఎన్ కౌంటర్ మృతుల గుర్తింపు

#MuluguPolice

ములుగు జిల్లాలోని మంగపేట ముసలమ్మ గుట్ట ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఇద్దరు మావోయిస్టుల వివరాలను పోలీసులు తెలియజేశారు.

మృతులు మంగపేట, మణుగూరు ఏరియా కమిటీ కమెండర్ సుధీర్, మరో నేత లాక్మాల్‌గా గుర్తించారు. సుధీర్ పై వివిధ పోలీసు స్టేషన్లలో ఆరు కేసులు ఉన్నాయి.

అతని పేరుపై 4 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ములుగు ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. గుత్తికోయ గూడెంలపై నిఘా ఏర్పాటు చేశారు.

భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు ఏజెన్సీ అటవీ ప్రాంతంలో  పోలీస్ కుంబింగ్ కొనసాగుతోంది. ముళ్లకట్ట అంతర్రాష్ట్ర వంతెన వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. 

Related posts

ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాలువల పూర్తిలో అలసత్వం వద్దు

Satyam NEWS

కాపురాల ఏర్పాటుపై దేశంలో ఎలాంటి నిషేధం లేదు

Satyam NEWS

గోడ కూలి ముగ్గురు చిన్నారుల మృతి

Sub Editor

Leave a Comment