ములుగు జిల్లాలోని మంగపేట ముసలమ్మ గుట్ట ఎన్కౌంటర్లో మృతి చెందిన ఇద్దరు మావోయిస్టుల వివరాలను పోలీసులు తెలియజేశారు.
మృతులు మంగపేట, మణుగూరు ఏరియా కమిటీ కమెండర్ సుధీర్, మరో నేత లాక్మాల్గా గుర్తించారు. సుధీర్ పై వివిధ పోలీసు స్టేషన్లలో ఆరు కేసులు ఉన్నాయి.
అతని పేరుపై 4 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఎన్కౌంటర్ నేపథ్యంలో ములుగు ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. గుత్తికోయ గూడెంలపై నిఘా ఏర్పాటు చేశారు.
భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు ఏజెన్సీ అటవీ ప్రాంతంలో పోలీస్ కుంబింగ్ కొనసాగుతోంది. ముళ్లకట్ట అంతర్రాష్ట్ర వంతెన వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.