ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కల్పిలు జరిగాయి. ఈ సంఘటనలో ఇద్దరు మావోయిస్టు మృతి చెందగా మిగతా మావోయిస్టులు మావోయిస్టులు తప్పించుకున్నరు. మావోయిస్టులకు చెందిన భారీ పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మావోయిస్టుల కదలికలపై సమాచారం అందుకున్న పోలీసులు ఏఓబి ఎస్ జెడ్ సి కు చెందిన మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారం మేరకు గాలింపు చర్యలు నిర్వహిస్తున్న పోలీసు బలగాలపై మావోయిస్టు కాల్పులు జరిపారు.
బోయిపరిగూడ PS పరిధిలోని మలిపాడు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు క్యాంప్పై పోలీసులు దాడి చేయగా మావోయిస్టులు కాల్పులు జరిపారు ప్రతిగా పోలీసులు కూడా కాల్పులు జరిపారు. మావోయిస్టులు కాల్పులు జరుపుతూ సమీప అటవీ ప్రాంతం నుంచి తప్పించుకున్నారు. అనంతరం సంఘటన స్థలములు గాలించగా మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలు పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు . దీంతోపాటు గుర్తుతెలియని రెండు మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు.