నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని చెరుకూరు గేటు వద్ద శ్రీశైలం రహదారి పై కారు బైకు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కల్వకుర్తి నుండి హైదరాబాద్ దారిలో వెళుతున్న కారు ,పెద్దాపూర్ కు చెందిన రమేష్36, సత్తయ్య 41 రోడ్డు మలుపు ను దాటిస్తూ ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు కారు అదుపు తప్పి బైకును డీ కొట్టినట్లు వారు తెలిపారు.
సత్తయ్యకు పక్కటెముకలకు గాయాలు కావడంతో ఆమన్గల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వెల్దండ ఎస్ఐ సత్తిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.