30.7 C
Hyderabad
April 23, 2024 23: 11 PM
Slider నల్గొండ

సూర్యాపేట జిల్లాలో ఇద్దరు తహసీల్దార్ లు సస్పెన్షన్

SuryapetCollector

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 540 లో ప్రభుత్వ భూములను ఇతరులకు పట్టాలు చేశారని ఇద్దరు తహసిల్దార్ లను సస్పెండ్ చేస్తూ  ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.

ప్రస్తుత మఠంపల్లి తాహసిల్దార్ గా ఉన్న వేణుగోపాల్, గరిడేపల్లి తాహసిల్దార్ గా పనిచేస్తున్న చంద్రశేఖర్ లను సస్పెండ్ చేసిన కలెక్టర్.430 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా మ్యూటేషన్ ఇచ్చిన రెవిన్యూ యంత్రాంగం.52 ఎకరాలు స్థానికులకు అక్రమంగా పట్టాలు ఇచ్చిన వేణుగోపాల్, 369 ఎకరాల భూమిని గ్లెడ్ ఆగ్రో బయోటెక్ సంస్థకు అక్రమంగా పాసు పుస్తకాలు జారీ చేసిన ఎమ్మార్వో చంద్రశేఖర్.

540 సర్వేనెంబర్ లో 6వేల ఎకరాల భూమికి గాను 12 వేల ఎకరాలకు పాస్ పుస్తకాలు ఇచ్చిన రెవెన్యూ యంత్రాంగం. కొనసాగుతున్న , విచారణ,సర్వే చేస్తున్న అధికార యంత్రాంగం. మరి కొంతమంది రెవెన్యూ అధికారుల పై వేటు పడే అవకాశం ఉందని భొగట్టా.

Related posts

ఉప్పల ట్రస్ట్ సహకారంతో మూత్రశాల నిర్మాణం

Satyam NEWS

సవతి పిల్లలతో కలిసి ఉండలేని మహిళ ఆత్మహత్య

Satyam NEWS

మంత్రి రోజా కు ఘన స్వాగతం పలికిన కరకంఠాపురం ప్రజలు

Bhavani

Leave a Comment