దేశ వ్యాప్తం గా లాక్ డౌన్ కొనసాగుతూ జనజీవనం స్తంభిస్తున్న నక్సల్స్ కు పోలీసులకు మధ్య వైరం ఆగడం లేదు.ఎన్కౌంటర్ లు ఆపడం లేదు.తాజాగా ఛత్తీస్గఢ్లోని కొండగావ్ జిల్లాలో నక్సల్కు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు నక్సల్ ప్రాణాలు కోల్పోగా మరికొందరికి గాయాలయ్యాయి. కేష్కల్ బ్లాక్ పరిధిలోని కున్మారి అడవి ప్రాంతంలో నక్సల్స్ కోసం పారామిలిటరీ దళాలు మంగళవారం మధ్యాహ్నం కూంబింగ్ చేపట్టాయి.నమ్మకమైన సమాచారం మేరకు నక్సలైట్లు ఉన్నారనే పోలీసులు కుంబిన్గ్ జరపగా పోలీసులు తారసపడటంతో అక్కడే ఉన్న నక్సల్స్ కాల్పులు ప్రారంభించారు. కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడినట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.
ఘటనా స్థలంలో ఒక SLR, ఒక303 రిఫైల్, మూడు 12 బోర్ రిఫైల్స్, ఇంకా అనేకరకమైన రోజువారీ సామాగ్రి స్వాధీనం చేసుకున్నమని , గత కొద్దిరోజుల నుండి నార్త్ కాంకేర్-మెన్ పురా డివిజన్ కమిటీ మావోయిస్ట్ పార్టీ ఆచూకీ కోసం BSF, ITBP, STF, DRE,బలగాలతో వేతు కుతున్నామని ఈ తరుణం లోనే పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించామని, ఇందులో భాగంగానే ఈ ఎంకౌంటర్ జరిగిందని బస్టర్ జిల్లా IG తెలిపారు.