చందానగర్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మామ, మేనకోడలు మృతి చెందిన సంఘటన జరిగింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం పాపిరెడ్డి కాలనీ చందానగర్ ప్రాంతానికి చెందిన మనోహర్(24 ), సోని (14 ) మేనకోడలు తన మామ తో కలిసి పాపిరెడ్డి కాలనీ నుంచి చందానగర్ వెళుతుండగా మార్గమధ్యం లో చందానగర్ రైల్వే స్టేషన్ నుంచి పట్టాలు దాటుతుండగా అకస్మాత్తుగా లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎం ఎం టీ ఎస్ దూసుకువచ్చింది.
పట్టాలు దాటుతున్న వారిని ఢీకొనడం తో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెంది తునకలు, తునకలయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నాంపల్లి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.