నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని హజారీగూడెం ఒక్క సారిగా భయంతో వణికిపోయింది. ఆ గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్లను వేటకోడవళ్లతో నరికి చంపారు ఎవరో దుండగులు. మృతులను సత్యనారాయణ, అంజిగా పోలీసులు గుర్తించారు.
వీరిద్దరూ ఇంటి ఆరుబయట మంచంపై నిద్రిస్తుండగా దుండగులు ఎటాక్ చేసినట్లు అక్కడ కనిపిస్తున్నది. హరి అనే మరో వ్యక్తి దాడి నుంచి తప్పించుకున్నట్లు కూడా పోలీసుల ప్రాధమిక సమాచారం. ఈ ముగ్గురు కూడా ఒక హత్య కేసులో నిందితులు. వీరంతా ఇటీవలే బెయిల్ పై విడుదల అయి వచ్చారు.
దీన్ని ప్రతీకార హత్యగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.