36.2 C
Hyderabad
April 16, 2024 19: 58 PM
Slider కడప

విలాసాలకు మరిగిన యువకులు చోరీలు చేస్తూ…

#Rajampet Police

విలాసాలకు మరిగిన ఇద్దరు యువకులు అక్రమంగా, సులువుగా సంపాదించాలని ఉద్దేశ్యంతో దొంగతనాలకు పాల్పడి కటాకటాల పాలయ్యారు. కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లె లో మే 20 తేదీ మూడు సెల్ ఫోన్ లు,బంగారు చైన్ చోరీ కేసులో ఇద్దరు దొంగలను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సోమవారం మీడియా సమావేశంలో డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి ,రూరల్ సి.ఐ,రూరల్ ఎస్సై  మాట్లాడుతూ ఇద్దరు దొంగలని మీడియా ఎదుట హాజరు పరిచారు. కాగా దొంగతనంకు పాల్పడిన రాజంపేటకు చెందిన జట్టి సాయిప్రసాద్, కడప జిల్లా చెన్నూరు కు చెందిన ప్రొద్దుటూరు వెంకట సుధాకర్ అనే యువకులు విలాసాలకు మరిగి అక్రమార్గంలో సులువుగా దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు.

మే నెల 7వతేది బోయినపల్లె లో మొదటి ప్లోర్లోని వరండాలో నిద్రిస్తున్న తరుణం బంగారు చైన్,మూడు ఫోన్ లు దొంతనం చేశారు. బంగారు చైన్ ను రాజంపేట లో అమ్మితే బండారం బయట పడుతుందన్న ఉద్దేశ్యంతో, లాక్ డౌన్ సడలింపు కావడంతో కడపకు వెళ్లి అమ్మాలని ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ముందస్తు సమాచారం తో వారిని పోలీసు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు,బంగారు చైన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

Related posts

విజయనగరం లో కొనసాగుతున్న బంద్..!

Satyam NEWS

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం

Satyam NEWS

రాజుగారి దెబ్బకు రాజకీయ వ్యూహం మరిచిన పెద్దలు

Satyam NEWS

Leave a Comment