28.2 C
Hyderabad
April 20, 2024 12: 05 PM
Slider తూర్పుగోదావరి

గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతు

#Godavari River

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం బడుగువానిలంక రెవిన్యూ పరిధిలో గౌతమీ గోదావరి నదిలో స్నానాలు దిగి ఇరువురు యువకులు గల్లంతయ్యారు. కడియం మండలం వీరవరం గ్రామానికి చెందిన పూలరౌతు శ్రీను (28), గుమ్మడి లోవరాజు (36) మంగళవారం స్నానాలకు వచ్చి గౌతమీ గోదావరిలో స్నానం ఆచరిస్తుండగా ఒక్కసారిగా గల్లంతు అయ్యారు.

పది రోజుల క్రితమే ఇదే ప్రాంతంలో కడియపులక కు చెందిన ఒక యువకుడు స్నానం చేస్తూ గల్లంతై మృతి చెందగా అదే ప్రాంతంలో రెండో ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.  గౌతమి గోదావరి నదిలోకి స్నానాలకు వెళ్లవద్దని పోలీస్ వారు ఎంత హెచ్చరికలు జారీ చేస్తున్న వినక పోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.

Related posts

కర్ఫ్యూ ఆదేశాలు తుంగలోకి..ఎస్పీ రావడంతో వ్యాపారస్థులు బెంబేలు..!

Satyam NEWS

సీఎం మార్పు లేదు: నేనే సిఎంగా ఉంటా

Satyam NEWS

ఆడ‌బిడ్డ‌ల‌కు అభ‌య‌హ‌స్తం…దిశ యాప్…!

Satyam NEWS

Leave a Comment