తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం బడుగువానిలంక రెవిన్యూ పరిధిలో గౌతమీ గోదావరి నదిలో స్నానాలు దిగి ఇరువురు యువకులు గల్లంతయ్యారు. కడియం మండలం వీరవరం గ్రామానికి చెందిన పూలరౌతు శ్రీను (28), గుమ్మడి లోవరాజు (36) మంగళవారం స్నానాలకు వచ్చి గౌతమీ గోదావరిలో స్నానం ఆచరిస్తుండగా ఒక్కసారిగా గల్లంతు అయ్యారు.
పది రోజుల క్రితమే ఇదే ప్రాంతంలో కడియపులక కు చెందిన ఒక యువకుడు స్నానం చేస్తూ గల్లంతై మృతి చెందగా అదే ప్రాంతంలో రెండో ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గౌతమి గోదావరి నదిలోకి స్నానాలకు వెళ్లవద్దని పోలీస్ వారు ఎంత హెచ్చరికలు జారీ చేస్తున్న వినక పోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.