32.2 C
Hyderabad
March 28, 2024 21: 30 PM
Slider సంపాదకీయం

U turn: రాజధాని అమరావతి కోసం ఉద్యమం చేస్తాం

#SomuVerrajuBJP

రాజధాని అమరావతికి పూర్తి మద్దతు తెలిపారు గతంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ. అయితే కాలక్రమేణా ఆయనపై చంద్రబాబు నాయుడి ఏజెంటు అనే ముద్ర వేశారు. చంద్రబాబునాయుడి ఏజెంటు కావడం వల్లే ఆయన మద్దతు ఇస్తున్నట్లే కన్నా కూడా అమరావతికి మద్దతు ఇస్తున్నారని దారుణమైన వ్యాఖ్యలు చేశారు.

అమరావతికి ప్రతికూలంగా మాట్లాడిన సోము వీర్రాజును బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడు అయిన నాటి నుంచి కూడా సోము వీర్రాజు అమరావతికి అనుకూలంగా మాట్లాడలేదు. అమరావతికి అనుకూలంగా మాట్లాడిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు.

ఇదంతా గతం. వర్తమానం ఏమిటంటే సోము వీర్రాజు అమరావతికి పూర్తి మద్దతు ప్రకటించారు. లోపల ఏం జరిగిందో ఏమో కానీ సోము వీర్రాజు కూడా అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని సోము వీర్రాజు చెప్పడం ఇప్పుడు పెద్ద వార్తగా మారింది.

భారతీయ కిసాన్‌ సంఘ్‌ రాష్ట్ర అధ్యక్షులు అన్నా రాంబాబు ఆధ్వర్యంలో తుళ్లూరులో ఉద్యమిస్తున్న రాజధాని ప్రాంత చిన్న, సన్నకారు రైతుల సమ్మేళనంలో పాల్గొన్న సోము వీర్రాజు వారికి ఈ హామీ ఇచ్చారు. ముందుగా రాజధాని కోసం ఏడాదిగా ఆందోళన చేస్తున్న ఉద్యమకారులను అభినందించారు.

సానుభూతిని తెలిపారు. అమరావతి రాజధానిలోనే ఉండాలనేది బిజెపి ఉద్దేశ్యం అన్నారు. ఇందులో రెండో ఆలోచనకు తావులేదన్నారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు 64 వేల పట్టాలివ్వాలని, మిగిలిన 9 వేల ఎకరాలు భూమిని అభివృద్ది చేయాలని డిమాండ్‌ చేశారు. ఇది బిజెపి స్పష్టమైన అభిప్రాయంగా చెప్పారు. విజయవాడలోనే పార్టీ సొంత కార్యాలయం నిర్మిస్తున్నట్లు తెలిపారు.

జగన్ మూడు రాజధానులను ఖండిస్తున్నాం

ముఖ్యమంత్రి జగన్‌ అమరావతిలోనే రాజధాని కడతానని చెప్పి దానికి విరుద్దంగా 3 రాజధానుల గురించి ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. రూ.72,00 గత ప్రభుత్వం రాజధానికి ఖర్చుచేసిందన్నారు. అందులో కేంద్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు ఇవ్వగా, అమరావతి స్మార్ట్‌సిటి కోసం రూ.800 కోట్లు, హడ్కోద్వారా రూ.4 వేల కోట్ల రుణం ఇచ్చారన్నారు.

రాజధాని విషయంలో ప్రధాని మోదీ కలుగచేసుకోవాలని అంటున్నారని, ఏ విషయంలో కలుగచేసుకోవడం లేదో ప్రశ్నించినవారు చెప్పాలన్నారు. జగన్‌ రాజధాని తీసుకెళ్లిపోయినా ఇక్కడ మాత్రం కేంద్ర సంస్థలను ప్రధాని నిర్మిస్తూనే ఉన్నారన్నారు.

కేంద్రం రూ. 1,800 కోట్లతో నిర్మించే ఎయిమ్స్‌ ఎంత అద్బుతంగా ఉందో చూడాలన్నారు. అలాగే మరో పక్క అగ్రివర్శిటీ, పక్కనే డిజైన్‌ జాతీయ విద్యాసంస్తను నిర్మిస్తుందని వీటిని రైతులు గుర్తించాలన్నారు. కనకదర్గ ఫ్లైఓవర్‌ను, బెంజిసర్కిల్‌ వద్ద రెండు ఫ్లైఓవర్లను, మచిలిపట్నానికి 6 లైన్ల రహదారి, నిమ్మకూరు, అవనిగడ్డల్లో రక్షణ మంత్రిత్వసంస్థ కార్యాలయంలు, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు.

ఇవన్నీ బిజెపి చిత్తశుద్ధిని నిదర్శనం

ఇది బిజెపి చిత్తశుద్దిగా పేర్కొన్నారు. ప్రధాని రాజధాని శంకుస్ధాపనకు పుణ్యనదుల నుంచి నీరు తెచ్చి వెళ్లిన అరగంట నుంచి తీవ్ర విమర్శలు చేసినా బిజెపి ఏం మాట్లాడలేదన్నారు. రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించాలని బిజెపి తీవ్రంగా ఉద్యమిస్తుందని భరోసా ఇచ్చారు. 

2024లో బిజెపికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఊహించని విధంగా అభివృద్ది చేస్తామన్నారు. రాజధానిని అయిదేళ్లలో రూ.5 వేల కోట్లతో అద్బుతంగా నిర్మిస్తామని, రూ.2 వేల కోట్ల నిధులతో అతిసుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. 9 వేల ఎకరాల్లో పార్కులు, వ్యవసాయ, విద్యాసంబంధ సంస్థలు అభివృద్ది చేస్తామన్నారు.

బిజెపి అన్నీ చేసి చూపిస్తోందని, ముఖ్యమంత్రి జగన్‌లా ఎక్కడికీ పోవడం లేదన్నారు. బిజెపి ఉద్యమకారులతోనే ఉందని  అన్నారు. ఈ ప్రభుత్వం చట్ట వ్యతిరేకచర్యలకు పాల్పడుతోందని రైతులు, మహిళలపై ఎస్సీఎస్టీ కేసులుపెడితే బిజపి సహించదని మండిపడ్డారు.

బిజెపి రైతాంగంతో ఎల్లవేళలా ఉండే పార్టీగా భరోసా ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా రాజధానిని అమరావతిలోనే నిర్మిస్తామన్న జగన్‌ ఇప్పుడు సిఎం హోదాలో  బాధ్యతతో రైతులను పిలిచి వారితో మాట్లాడాలని సూచించారు.

ఇంతకు ముందు ఇవే మాటలు చెప్పిన బిజెపి నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సోము వీర్రాజు అకస్మాత్తుగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పలువురికి ఆశ్చర్యం కలిగింది. అమరావతికి అనుకూలంగా మాట్లాడిన వారిపై ఇప్పుడు సస్పెన్షన్ ఎత్తివేస్తారా?…. చూడాలి.

Related posts

జగన్ ప్రభుత్వంపై వై ఎస్ సన్నిహితుల అసంతృప్తి

Satyam NEWS

ఐదుగురు ఐఏఎస్‌ అధికారులకు జైలు శిక్ష

Satyam NEWS

నిరాశ్రయులకు అన్నదానం చేసిన బిచ్కుంద ఉపసర్పంచ్

Satyam NEWS

Leave a Comment