27.7 C
Hyderabad
March 29, 2024 04: 41 AM
Slider చిత్తూరు

తిరుపతిలో ఉదయం పక్షపత్రిక నాలుగవ వార్షికోత్సవం

#tirupati

ఎడిటర్ మునికుమార్ రాజు ఆధ్వర్యంలో వెలువడుతున్న ఉదయం పక్షపత్రిక నాలుగవ వార్షికోత్సవ సభ తిరుపతి యూత్ హాస్టల్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మునికుమార్ రాజు దంపతులు, కాంగ్రెస్ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి, బిజెపి నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సమాజంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వక్తలు అన్నారు.

జర్నలిజంలో ఉంటూ కిడ్నీ బాధితులకు ఆసరాగా నిరంతరం సేవ చేస్తున్న మునికుమార్ రాజు సేవలు అభినందనీయమని వారు తెలిపారు.

తిరుపతి నగరంలో కిడ్నీ బాధితుల సౌకర్యార్థం మరిన్ని డయాలసిస్ సెంటర్లను టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి బాధితులకు ఉచితంగా డయాలసిస్ వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి కోరారు.

స్విమ్స్ ఆధ్వర్యంలో కిడ్నీ బాధితులకు అందిస్తున్న నెఫ్రో ప్లస్ సంస్థ వైద్య సదుపాయాలను మెరుగుపరిచి నాణ్యమైన వైద్యం అందించాలని ఆయన అన్నారు.

Related posts

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

Satyam NEWS

సిఎం కేసీఆర్ తిట్లే ఏపిఎస్ ఆర్టీసీ విలీనానికి మెట్లు

Satyam NEWS

కరెంటు ఎందుకు పోతుంది? బిల్లులు ఎందుకు పెరుగుతున్నాయి?

Satyam NEWS

Leave a Comment