రోడ్డు ప్రమాదానికి గురై వైద్యం కోసం ఎదురుచూస్తున్న ఉద్దానం సేవా సమితి సభ్యుడిని ఆ సంస్థ సభ్యులు ఆదుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పర్రి పుట్టిగ గ్రామానికి చెందిన పూర్ణ చంద్రరావు కొద్ది రోజుల కిందట రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్న తమ సభ్యుడే ప్రమాదంలో ఉండటంతో ఉద్దానం సేవా సమితి పూర్ణ చంద్రరావుకు తక్షణ సాయం అందించింది.
ఈ కార్యక్రమములో ఉద్దానం సేవా సమితి సభ్యులు హరి ప్రసాద్, సునీల్ గ్రామ సభ్యులు పాల్గొన్నారు.
సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఉద్దానం సేవ సమితి ఉంటుందని తమ సహాయం కావాల్సిన వారు 8972352899 నెంబర్ కు ఫోన్ చేయవచ్చునని నిర్వాహకులు తెలిపారు.