మహారాష్ట్ర గవర్నర్ మెజారిటీ పరీక్ష నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడంతో, ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు శాసనమండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఫేస్బుక్ ద్వారా ఉద్ధవ్ తన మనోభావాలను వెల్లడించారు.
ఔరంగాబాద్ను శంభాజీ నగర్గా, ఉస్మానాబాద్ను ధారాశివ్గా అధికారికంగా మార్చినందుకు తాను సంతృప్తి చెందినట్లు ఉద్ధవ్ వెల్లడించారు. ఇవి బాలాసాహెబ్ థాకరే పేరు పెట్టిన నగరాలు అని వాటి పేర్లను అధికారికంగా పెట్టడం సంతృప్తినిచ్చిందని తెలిపారు. అదే విధంగా రైతుల రుణాలు మాఫీ చేయడం సంతృప్తినిచ్చిందని వెల్లడించారు. ‘‘ఏమీ ఇవ్వని వారు మద్దతు పలికారు. నేను ఇచ్చిన వారికి కోపం వచ్చింది. కాంగ్రెస్-ఎన్సీపీ మాకు మద్దతిచ్చాయి. నాకు మద్దతిచ్చిన ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని ఆయన అన్నారు.
ఎవరికి ఎన్ని సంఖ్యలు ఉన్నాయో నా ఉద్దేశ్యం కాదు, రేపు వారు మెజారిటీ నిరూపించుకుంటారు. సీఎం పదవిని వదులుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. నేను ఊహించని విధంగా (అధికారంలోకి) వచ్చాను. నేను అలానే వెళ్తున్నాను. నేను ఎప్పటికీ వదిలి వెళ్లను, ఇక్కడే ఉంటాను, మరోసారి శివసేన భవన్లో కూర్చుంటాను. నా ప్రజలందరినీ నేను సమీకరించుకుంటాను అని ఆయన స్పష్టం చేశారు.