విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో శ్రీ ప్లవ నామ సంవత్సర వేడుకలు పూర్తి సంప్రదాయ పద్దతిలో జరిగాయి. జిల్లా కలెక్టర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ డా.హరిజవహర్ లాల్ ను మేళతాళాలతో కలెక్టర్ ఆడిటోరియంలో కి ఆహ్వానించారు.
కలెక్టర్ కూడా.. సంప్రదాయ దుస్తులైన పంచ ,కండువాలతో పట్టు వస్త్రాలతో ఉగాది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఈ వేడుకలన్నీ జిల్లా రెవిన్యూ శాఖా అధికారి గణపతిరావు ఆధ్వర్యంలో జరిగాయి.ముందు గా నాద స్వరం..మహారాజ సంగీత కళాశాల విద్యార్ధులచే సంగీతాలాపన ,అలాగే పంచాంగ శ్రవణం. వంటి కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో… జిల్లా సమాచార సాంస్కృతిక, సమాచార శాఖ అధికారి రమేష్, జేసిలు వెంకటరావు, మహేష్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి నాగమణి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.