38.2 C
Hyderabad
April 25, 2024 14: 15 PM
Slider ముఖ్యంశాలు

తెలుగు ప్రజలకు  చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు

#chandrababu

తెలుగు వారికి ప్రత్యేకమైన ఉగాది పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ  టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మనందరం శోభకృత్ నామ తెలుగు సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. శోభను కలిగించేది శోభకృత్. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలకు ప్రగతి శోభ రావాలి. చీకట్లు తొలగిపోయి అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నవోదయం రావాలన్నారు. 

ప్రకృతిలో కలిగే మార్పుకు సంకేతంగా ఉగాది జరుపుకుంటాం. అలాగే మన జీవితంలో కూడా కొత్త ఏడాది శుభప్రదమైన మార్పును తేవాలని ఆకాంక్షిద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో కొత్త ఏడాది పెనుమార్పులు తేబోతుందని ఉగాదికి మూడు రోజుల ముందే మనకు అర్థం అయ్యింది. ప్రజలు ఉగాది పంచాంగం ముందే చెప్పేశారు. ఇది రాష్ట్రానికి శుభసూచకం. శుభప్రదమైన ఆ మార్పును స్వాగతిద్దామన్నారు. ఈ ఉగాది మీ ఇంటిల్లిపాదికీ శుభాలను కలిగించాలని, మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

కీర్తీ సురేష్ ఇప్పుడు మిస్ ఇండియా

Satyam NEWS

మంజూరైన గృహాలు త్వరితగతిన పూర్తి చేయాలి

Satyam NEWS

వరల్డ్ గ్రేటెస్ట్ బ్రాండ్ అండ్ లీడర్ గా శిద్దా సుధీర్

Satyam NEWS

Leave a Comment