35.2 C
Hyderabad
April 24, 2024 14: 24 PM
Slider కరీంనగర్

అగ్లీ ఫెలోస్: బాలికపై పై కిరాతకానికి పాల్పడ్డ నీచులు

minor girl

కరీంనగర్ జిల్లా కేంద్రంలో తొమ్మిదేళ్ల చిన్నారిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంబేడ్కర్ నగర్‌ కు చెందిన చిన్నారి మూడవ తరగతి చదువుతోంది.

ఈ నెల 24న ఆ పాపను ఆడుకుందాం రమ్మని పిలిచి నమ్మించి ముగ్గురు వ్యక్తులు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం చిన్నారిని ఇంటి దగ్గర వదిలి వెళ్లారు. గురువారం ఉదయం చిన్నారి తలనొప్పి వస్తోందని ఏడ్చింది. ఏం జరిగిందని తల్లి ఆరా తీయగా చిన్నారి అసలు విషయాన్ని చెప్పింది. దీంతో చిన్నారి తల్లి కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల్లో ఒకరు మైనర్ కాగా, మిగిలిన ఇద్దరు మేజర్లేనని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో కలకలం సృష్టిస్తోంది.

Related posts

శాంతియుత హైదరాబాద్ కోసం టీఆర్ఎస్ కే ఓటు

Satyam NEWS

హైదరాబాద్ లో కరోనా లాబ్య్ వివరాలు ఇవి

Satyam NEWS

ఇల్లీగల్: నది మనదే ఇసుక తోడుకో డబ్బు దోచుకో

Satyam NEWS

Leave a Comment