28.7 C
Hyderabad
April 20, 2024 05: 35 AM
Slider నిజామాబాద్

అగ్లీ ఫెలో: ప్రిన్సిపాల్ దిష్టిబొమ్మ దగ్ధం

ugly fellow

మద్నూర్ గురుకుల పాఠశాలలో స్టాఫ్ నర్స్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపాల్ శ్రీనివాస్ దిష్టిబొమ్మను అఖిలపక్ష నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు దగ్ధం చేసారు. మద్నూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై కీచక ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, అఖిలపక్ష నాయకులు ధర్నా చేపట్టారు. ప్రిన్సిపాల్ దిష్టిబొమ్మను తగులబెట్టారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్నూర్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వర్తిస్తున్న సునీతపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నిన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మద్నూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై అఖిల పక్ష నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… పాఠశాలలో మహిళ సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్న ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో నేనే రాజు నేనే మంత్రి అన్న రీతిలో అరాచకంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ లోకల్ సిబ్బందిని కాకుండా నాన్ లోకల్ సిబ్బందిని నియమించుకుని వేధిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తిని వెంటనే విధుల నుంచి తొలగించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.

Related posts

పోలియో నిర్మూలన మనందరి బాధ్యత: ఎమ్మెల్యే సైదిరెడ్డి

Satyam NEWS

కొల్లాపూర్ ప్రాంత కృష్ణానది పడవ యజమానులకు పోలీస్ హెచ్చరిక

Satyam NEWS

పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి సకాలంలో పూర్తి చేయాలి

Satyam NEWS

Leave a Comment