ప్రవేట్ వైద్యశాలలో కూడా గ్రామ స్థాయిలో నాణ్యమైన వైద్యం అందెలాగా చూడాలని శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని లింగగిరి రోడ్ నందు గల శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ లో లాప్రోస్కోపిక్ ఆపరేషన్ థియేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన అనంతరం సైదిరెడ్డి మాట్లాడుతూ దూరప్రాంతాలకు వెళ్లకుండా అత్యాధునిక టెక్నాలజీని హుజూర్ నగర్ పట్టణంలో ఎర్పాటు చేస్తున్న హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రైవేటు వైద్యశాలలో కూడా గ్రామ స్థాయి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ ధనార్జన లేకుండా అందరికీ వైద్యం అందుబాటులో ఉండేలా చేయాలని అన్నారు.కరోనా సమయంలో కూడా అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో వచ్చిన రోగులకు వైద్యాన్ని అందించిన ఘనత ప్రభుత్వ వైద్యశాలతో పాటు ప్రైవేటు వైద్యశాలకు కూడా దక్కుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర నర్సింగ్ హోమ్ యాజమాన్యం డాక్టర్ శివప్రసాద్,సిబ్బంది, మున్సిపల్ వైఎస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకులు గెల్లి రవి,పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్