31.2 C
Hyderabad
April 19, 2024 05: 19 AM
Slider జాతీయం

Un Lock 3.0: సినిమా ధియేటర్లకు పర్మిషన్ నో

#Unlock3.0 Fresh

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కరోనా లాక్డౌన్ ఆంక్షలను అన్ లాక్ పేరుతో సడిలిస్తూ వస్తోంది. ఈ నెల 31తో అన్లాక్ 2.0 ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది.

అన్ లాక్ 3.0 ద్వారా కేంద్రం మరిన్ని కార్యకాలాపాలకు అనుమతులు ఇచ్చింది. కంటెయిన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. కంటెయిన్మెంట్ జోన్ల వెలుపల నిర్వహించుకునే కార్యకలాపాలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది.

అన్ లాక్ 3.0 మార్గదర్శకాలు:

ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు మాస్కు ధరించి మరింత అప్రమత్తంగా ఉండాలి. కేంద్ర హోంమంత్రిత్వశాఖ అన్ లాక్ 3.0 మార్గదర్శకాలు: అన్ లాక్ 3.0 పేరుతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో  కంటైన్మెంట్ జోన్లకు వెలుపల మరిన్ని కార్యకాలాపాలు ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మార్గదర్శకాలు ఆగస్టు 1 వ తేదీ నుంచి నుంచి ఆమలులోకి వస్తాయి.

కొత్తగా విడుదల చేసిన ఈ మార్గదర్శకాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి అందిన ప్రతిస్పందనల ఆధారంగా సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖలు, విభాగాలతో విస్తృతంగా చర్చించి  విడుదల చేశారు. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా స్థానికంగా అదనపు ఆంక్షలు విధించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది.

 అయితే.. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలను సడలించే అధికారం మాత్రం రాష్ట్రాలకు లేదని స్పష్టం చేసింది. మార్గదర్శకాలలోని ముఖ్యాంశాలు:1. రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేసింది. ప్రజలు రాత్రి పూట బయట తిరగవచ్చు. అయితే కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.2. ఆగస్టు 5 నుంచి నాన్ కంటైన్మెంట్ జోన్లలో జిమ్స్, యోగా సెంటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది.

అయితే ఈ సెంటర్లలో సామమాజిక దూరం పాటించడం, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్.ఒ.పి)ను పాటించాల్సి ఉంటుంది. 3.సామాజిక దూరం, ఇతర ఆరోగ్య సంబంధిత ప్రొటోకాల్స్ పాటిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, ‘అట్ హోం’ కార్యక్రమాలు జరుపుకోవడానికి కేంద్రం అనుమతిచ్చింది.

ఇందుకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 21-07-2020న జారీచేసిన ఆదేశాలను పాటించాలి.4. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో విస్తృతంగా చర్చించిన మీదట స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లను 2020 ఆగస్టు 31 వరకు మూసివేసి ఉంచాలని నిర్ణయించారు.

5. శ్రామిక్ రైళ్లు, దేశీయ విమాన సర్వీసులు, విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు కొనసాగుతాయని కేంద్రం తెలిపింది. కొవిడ్-19 ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఈ కార్యకలాపాలు సాగుతాయని తెలిపింది.6. అంతర్జాతీయ విమాన ప్రయాణికులను పరిమిత సంఖ్యలో అనుమతి ఇచ్చారు.

కేవలం వందేభారత్ మిషన్ కింద మాత్రమే ప్రయాణాలను అనుమతిస్తారు. మరింత మందిని అనుమతించే విషయం పరిస్థితిని  బట్టి నిర్ణయం తీసుకుంటారు.7. సినిమా థియేటర్లకు, మెట్రో రైళ్లకు, అనుమతి నిరాకరణ. 8. కంటైన్మెంట్ జోన్లకు బయట ఉన్న ప్రాంతాలలో ఈ కిందివాటికి మినహా అన్నీఅనుమతిస్తారు:

స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియాలు, సమావేశ మందిరాలు, సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, అకడమిక్, సాంస్కృతిక, మతపరమైన కార్య కలాపాలు మరియు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యే సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.

Related posts

Analysis: ఐదు రాష్ట్రాలూ మారనున్న జాతకాలు

Satyam NEWS

ఖ‌మ్మంలో టీఆర్ఎస్ కు భారీ షాక్‌

Satyam NEWS

విజయనగరం లో కమ్మిన కారు మబ్బులు.. ..చల్లదనంతో నగరం..!

Satyam NEWS

Leave a Comment