ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో వైసిపి బోణీ కొట్టింది. గుంటూరు జిల్లా పిట్టలవాని పాలెం మండలంలోని మంతెనవారిపాలెం ఎంపిటిసీ స్థానాన్ని రాష్ట్రంలో తొలి ఏకగ్రీవ స్థానంగా ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనాయకుడు కోన నిఖిల్ అన్ని వర్గాలతో మాట్లాడి ఆ స్థానికి పోటీ లేకుండా చేయగలిగారు. అందరూ కలిసి గ్రామాల అభివృద్ధికా పాటుపడాలని కోన నిఖిల్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.