అంబర్ పేట నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ లో సమస్యల నిర్మూలన కోసం ఎల్లవేళలా కృషి చేస్తా అన్ని అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఆదివారం గోల్నాక డివిజన్ లోని ఖాదర్ లో నూతనంగా చేపడుతున్న డ్రైనేజీ పైప్ లైన్ పనులను కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన డ్రైనేజీ పనులకు 13 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. అనంతరం ఖాదిరీ బాగ్ లో పాదయాత్ర చేసి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ నిర్మాణ పనుల్లో నాణ్యత కలిగిన ప్రమాణాలను పాటించాలి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, స్థానిక బస్తీ ప్రజలు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్ పేట్