ములుగు జిల్లా లోని వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో లో గల రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించింది.
దాంతో పాటు ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకుంది. తాజాగా యునెస్కో ఈ మేరకు ఆదివారం అధికారిక ప్రకటన చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ హోదా దక్కించుకున్న ఏకైక కట్టడంగా రామప్ప ఆలయం ఘనత సాధించింది.
ములుగు జిల్లా పాలంపేటలో 800 ఏళ్ల క్రితం కాకతీయులు దీన్ని నిర్మించారు.
కమనీయ శిల్పాలు, అరుదైన ఎరుపు రాతి నిర్మాణాలు, నీటిలో తేలియాడే రాళ్లతో పైకప్పు నిర్మాణం వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.