జీహెచ్ఎంసి ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా చార్మినార్ వద్ద నున్న భాగ్య లక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పటిష్టమైన బందోబస్తు మధ్య ఆయన పాతబస్తీ పర్యటన సాగింది. భాగ్యలక్ష్మి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకున్న ఆయన భక్తి పూర్వకంగా అమ్మవారికి ప్రణమిల్లారు.
ఈ సందర్భంగా ఆయనకు శేష వస్త్ర బహూకరించి, అమ్మవారి ప్రతిమను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో బాటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ.కిషన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్,
గోషామహల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్ తదితరులు ఉన్నారు. చార్మినార్ వద్దకు విశేష సంఖ్యలో చేరుకున్న బిజెపి కార్యకర్తలు జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.