39.2 C
Hyderabad
April 25, 2024 16: 02 PM
Slider జాతీయం

భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా పూజలు

#AmithShah

జీహెచ్ఎంసి ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా చార్మినార్ వద్ద నున్న భాగ్య లక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పటిష్టమైన బందోబస్తు మధ్య ఆయన పాతబస్తీ పర్యటన సాగింది. భాగ్యలక్ష్మి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకున్న ఆయన భక్తి పూర్వకంగా అమ్మవారికి ప్రణమిల్లారు.

ఈ సందర్భంగా ఆయనకు శేష వస్త్ర బహూకరించి, అమ్మవారి ప్రతిమను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో బాటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ.కిషన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్,

గోషామహల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్ తదితరులు ఉన్నారు. చార్మినార్ వద్దకు విశేష సంఖ్యలో చేరుకున్న బిజెపి కార్యకర్తలు జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Related posts

మళ్ళీ పుట్టిన ‘మహా’ముసలం

Satyam NEWS

నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

అర్హతే ప్రామాణికంగా సంక్షేమ కార్యక్రమాలు

Satyam NEWS

Leave a Comment