39.2 C
Hyderabad
April 25, 2024 16: 26 PM
Slider ఆదిలాబాద్

భైంసా అల్లర్ల బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి

kishan reddy

ఇటీవల అల్లర్లు జరిగిన నిర్మల్ జిల్లా బైంసా ను నేడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి సందర్శించారు. బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. అదేవిధంగా వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమని కేంద్ర మంత్రి అన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంట తెలంగాణ బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, మ్మెల్సీ రామచంద్రరావు, నిర్మల్ జిల్లా బిజెపి అధ్యక్షురాలు రమాదేవి తదితరులు ఉన్నారు. దాడుల్లో నష్టం జరిగిన ప్రతి కుటుంబానికి అన్ని రకాలుగా అండదండలు అందిస్తామని బిజెపి నాయకులు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వానికి కూడా వాస్తవ పరిస్థితిని వివరించి కేంద్రం ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శశిధర్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts

న్యాయస్థానాల లాక్ డౌన్ కొనసాగింపు

Satyam NEWS

రేపటి నుండి ములుగు జిల్లాలో లో రెండో దశ కరోనా టీకా

Satyam NEWS

విద్వేషాలను రెచ్చగొట్టే కేసీఆర్… ముందు క్షమాపణ చెప్పు

Satyam NEWS

Leave a Comment