35.2 C
Hyderabad
April 20, 2024 16: 22 PM
Slider హైదరాబాద్

పాఠశాలల పరిశుభ్రతకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాయం

#Kishan Reddy

బాగ్ అంబర్పేట్ డివిజన్ వాంబే కాలనీ లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి పాఠశాలో బాత్ రూమ్ లు శుభ్ర పరిచే పరికరాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర రెడ్డి, ప్రసున్నలకు అందచేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు అటల్ బిహారీ వాజ్పేయి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో బాత్ రూమ్ లు శుభ్రపరిచే పరికరాలను అందిస్తున్నారని తెలిపారు.

స్కూల్ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అందించిన ఈ బాత్రూం శుభ్రపరిచే పరికరాన్ని పాఠశాల వారు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి ఇన్చార్జ్ వెంకట్ రెడ్డి, డివిజన్ బిజెపి అధ్యక్షులు చుక్కజగన్, ప్రధాన కార్యదర్శి జెమ్మిచెట్టు బాలరాజ్, బిజెపి నాయకులు అచ్చిని రమేష్ , మిరియాల శ్రీనివాస్, అడ్వకేట్ శ్రీహరి, ట్యూషన్ శేఖర్, చిట్టిబాబు, గుగ్గిళ్ళ శ్రీనివాస్, బాలకృష్ణగౌడ్, రమేష్ ముదిరాజ్, ఎల్.శ్రీనివాస్, ముఖేష్ గౌడ్, శ్రీనివాస్ గంగపుత్ర ఇంకా అనేక మంది పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

ఐడిఎల్ చెరువు వద్ద పెద్దల విగ్రహాలు ఏర్పాటు చేయాలి

Satyam NEWS

శ్రద్ధావాకర్ ను తరచూ చిత్రహింసలకు గురిచేసిన అఫ్తాబ్

Satyam NEWS

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత

Satyam NEWS

Leave a Comment