విశాఖ ఏర్ పోర్ట్ లో కలెక్టర్ స్వాగతం..విజయనగరం జేడ్పీలో డీఆర్వీ ఘన స్వాగతం..
కేంద్ర ప్రభుత్వ పరిపాలన శాఖ ముందుగా ఇచ్చిన షడ్యూల్ ప్రకారం…కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.మన్ సుఖ్ మాండవీయ విజయనగరం జిల్లా కేంద్రానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు.ముందుగా పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం.. ఢిల్లీ…25 వ తేద మధ్యాహ్నం…ఢిల్లీ విమానాశ్రయం నుంచీ ప్రైట్ లో విశాఖకు చేరుకున్న కేంద్ర మంత్రిని విజయనగరం జిల్లాకలెక్టర్ సూర్యకుమారీ ఘనస్వాగతం పలికారు.
ప్రొటోకాల్ ప్రకారం..సాయంత్రమ విశాఖ కు చేరుకున్నకలెక్టర్ సూర్యకుమారీ…కేంద్ర మంత్రి ని అధికారికంగా పుష్పగుచ్ఛం ఇచ్చి జిల్లా లో జరగనున్నహాజరు కానున్న కార్యక్రమాలనుస్వాగతం పలికారు.అక్కడ నుంచీప్రత్యేక వాహనంలో విజయనగరం జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు…కేంద్ర మంత్రి డా.మన్ సుఖ్ మాండవీయ.
జేడ్పీ అతిథి గృహంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతి రావు… అధికార లాంఛనాలతో కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు.అలాగే ఆర్మర్డ్ రిజర్వు సిబ్బంది నుంచీ గౌరవ వందనం స్వీకరించారు. దీంతో అయనను జేడ్పీ అతిథిగృహంలో కేటాయించిన ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లారు..డీఆర్ఓ.అక్కడ నుంచీ ఎస్.కన్వేషన్ లో జరిగే పార్టీ కార్యక్రమానికి బయలు దేరారు.
మళ్లా తిరిగి వచ్చి జేడ్పీ లో రాత్రి బస చేసి..ఉదయం అంటే26 వ తేదీన జిల్లాలో గుంకలాం,నెల్లిమర్ల, కుమిలి,రామతీర్ధం లలో జరిగే అధికారిక కార్యక్రమాలకు కేంద్రమంత్రి హజరవుతారు. కేంద్ర మంత్రికి..డీఆర్ఓ తో పాటు ఆర్.డి.ఓ. భవానీ శంకర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా ఎస్వీ రమణ కుమారి తదితరులు విజయనగరం జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖ ఎయిర్ పోర్టు కు చేరుకున్న కేంద్ర మంత్రి డా. మన్ సుఖ్ మాండవీయ కు ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు… జిల్లా అధికారులు, బి.జె.పి. నాయకులు.