మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి నారాయణ్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి నాటికి మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పడిపోతుందని అన్నారు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని , బీజేపీ ప్రభుత్వం వస్తే మీరు ఆశించిన మార్పును చూస్తారని అన్నారు.
బీజేపీతో తెగతెంపులు చేసుకున్న శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ కూటమికి మహా వికాస్ అఘాడి అని పేరు పెట్టారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ మార్చిలోగా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పారు.