మంగళగిరి నృసింహునిని కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ దర్శించుకున్నారు. ఆమె ముందుగా పానకాల స్వామిని దర్శించుకుని అనంతరం దిగువ సన్నిధిలో గల నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించగా ఆలయ ఈవో రామకోటిరెడ్డి, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వెంట బిజెపి గుంటూరు జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి రాష్ట్ర కార్యదర్శులు పాతూరి నాగభూషణం, మాగంటి సుధాకర్ యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిది చందు సాంబశివరావు సీనియర్ నాయకులు జూపుడి రంగరాజు మంగళగిరి పట్టణ అధ్యక్షుడు ఆకురాతి నాగేంద్రం జగ్గారపు రాము, జగ్గారపు శ్రీనివాసరావు, పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
previous post