ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ‘గన్నా వర్సెస్ జిన్నా’ అంశాన్ని లేవనెత్తారు. నాణ్యమైన చెరకుకు జేవార్ పేరుగాంచిందని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు అల్లర్లకు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం యోగి ఆరోపించారు.
భారత దేశం చెరకు మాధుర్యాన్ని వ్యాప్తి చేస్తుంటే.. కొందరు జిన్నా ద్వేషాన్ని పంచుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి చెరుకు తీపి కావాలా లేక జిన్నాపై ద్వేషం కావాలా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసిన వ్యక్తిని ఆదర్శంగా భావించే ఇలాంటి వారి పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం యోగి అన్నారు.
సర్ధార్ పటేల్తో జిన్నాను ఎప్పటికీ పోల్చలేమన్నారు. ఉత్తరప్రదేశ్లో నేరాలకు సంబంధించి, మాఫియాపై మాత్రమే కాకుండా, మాఫియాను ప్రోత్సహించే వారిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.