జర్నలిస్టుల పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తున్న ఉప సర్పంచ్ భర్త పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు సంద బాబు డిమాండ్ చేశారు.
ములుగు మేజర్ గ్రామ పంచాయతీ సైడ్ డ్రైనేజ్ బాధితుల వద్ద ఉప సర్పంచ్ భర్త జర్నలిస్టుల పేరుతో డబ్బులు డిమాండ్ చేశాడని ఆయన అన్నారు.
పవిత్రమైన జర్నలిస్ట్ వ్యవస్థ పై అపవాదు మోపేలా ప్రవర్తించిన అతని పై చర్యలు తీసుకోవాలని అన్నారు.
ములుగు మేజర్ గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధి కాకున్నా ప్రతినిధిగా చెలామణి అవుతూ పంచాయతీరాజ్ చట్టాన్ని వక్రీకరించడమే కాకుండా, ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదించడం కోసం జర్నలిస్టుల పేరును వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు.
అతని ప్రవర్తన గురించి ఉన్నతాధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమని అన్నారు. వ్యక్తిగత దందా చేసే వ్యక్తులు జర్నలిస్టులను మధ్యలో లాగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
డబ్బులు అడిగిన జర్నలిస్టుల పేర్లను బహిర్గతం చేయాలని… చేయని పక్షంలో జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.